రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్
రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది.
తెలంగాణలో అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.
పార్లమెంటు ఎన్నికలు తమ పాలనకు రెఫరండం అన్న రేవంత్ రెడ్డి.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బొక్క బోర్లా పడింది.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్.
హైదరాబాద్ జూన్ 7 (మీడియా ఫోకస్ );రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని,తెలంగాణలో అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బొక్క బోర్లా పడిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికలు తమ పాలనకు రెఫరండం అన్న రేవంత్ రెడ్డి... ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో పార్టీ సీనియర్ నేత సి.విట్టల్ తో కలిసి మాట్లాడారు.గతంలో రేవంత్ పోటీ చేసిన మల్కాజ్ గిరి, తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్, రేవంత్ ఇన్చార్జిగా ఉన్న చేవెళ్ల లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు.రేవంత్ రెడ్డి పని అయిపోయింది, సొంత పార్టీ నాయకులే ఆయన మాట వినడం లేదు. మంత్రులే ఆయన మాటను పట్టించుకోవడంలేదన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిస్తే, ఇప్పుడు 8 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడం ఒక చారిత్రక ఘట్ట మన్నారు.బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు 16 పార్లమెంట్ స్థానాలు వస్తాయని బీరాలు పోయాడని అన్నారు.రేవంత్ కుట్రలను ప్రజలు బట్టబయలు చేసి, బీజేపీకి పట్టం కట్టారు. 8 సీట్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలుచేస్తే.. కాంగ్రెస్ ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.64 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి తప్పుచేశామని భావించిన ప్రజలు (8=8=64) మంది ఎమ్మెల్యేలకు సమానంగా బిజెపి నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి బిజెపిని ఆదరించారన్నారు.గత 7 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. ఇప్పుడు కోడ్ ముగిసినా హామీలు అమలు చేయకుండా ఇంకా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని దుయ్యబట్టారు.ఎన్డీయేను పక్షాన ప్రధానమంత్రిగా ఎన్డీయే పక్షాన నరేంద్ర మోదీని ప్రకటించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.రేవంత్ రెడ్డి డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానిస్తామంటూ ప్రకటించి, సోనియా మెప్పుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు.డిసెంబరు 9 తెలంగాణ ప్రజలను గాయపర్చి, ఆవేదనకు గురచేసిన రోజు.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, వెనక్కి తీసుకున్న రోజు అని ఎన్వీ సుభాష్ ఈ సందర్బంగా గుర్తు చేసారు. గత మూడు నెలలుగా ఎన్నికలు జరిగినన్ని రోజులు రైతులు తీసుకున్న రుణాల గురించి ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండి బ్యాంకుర్లు రైతులకు ఫోన్లు చేసి రుణాలు చెల్లించాలని, లేదంటే రెన్యువల్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందంటూ బెదిరిస్తున్నారు.డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని ప్రకటించి, అమలు చేయకుండా మళ్లీ పంద్రాగస్టున రుణమాఫీ చేస్తామంటూ మభ్యపెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల శ్రేయస్సు పట్ల చిత్తశుద్ధి ఉంటే పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయాలని ఎన్వీ సుభాష్ డిమాండ్ చేసారు.
About The Author
Editor of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as an executive editor, Buero Incharge, CEO.
In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.