కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్.

కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం.

కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్.

 

హైదరాబాద్ ఏప్రిల్ 12 (మీడియా ఫోకస్ );తెలంగాణలో బిజెపిని నిలువరించేందుకు కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలోని 17 సీట్లను 10 కాంగ్రెస్, 01 ఎంఐఎం, 06 బీఆర్ఎస్ పంచుకున్నట్లుగా స్పష్టంగా కనపడుతోందన్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో పట్టీపట్టనట్లుగా, ముట్టీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పార్టీలు ఎన్ని నాటకాలాడినా బిజెపి గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ల చీకటి ఒప్పందాన్ని ఎండగట్టారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన, లిక్కర్ కేసులో కవిత అరెస్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వెలుగులోకి రావడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది పెద్దల హస్తం ఉందని వార్తలు బయటకు వచ్చిన తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయన్నారు. మరోవైపు దేశంలో బిజెపి గెలుపును ఆపలేరని, బిజెపికి సొంతంగా 370 వరకు సీట్లు వస్తాయని పలు సర్వేలు వెల్లడించాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 11 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడవుతోంది. ప్రజల నుంచి స్పందన వస్తోందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నం.1 కాబోతోంది. ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే చెప్పారు. ఈ ఘటనల తర్వాత అసలు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యాయని అన్నారు.ఒకవైపు భారతదేశంలో I.N.D.I.A అని చెప్పుకుంటూ ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో సీట్ల ఒప్పందాలు కుదుర్చుకుని, బిజెపిని నిలువరించేలా వ్యవహరిస్తున్నారు.I.N.D.I.A లో చాలా రాష్ట్రాల్లో సీపీఎం, సీపీఐ వంటి కమ్యూనిస్టు పార్టీలూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం I.N.D.I.A లో అధికారికంగా ఏ ఏ పార్టీలు ఉన్నాయో అనే విషయాన్ని ఇంతవరకు రేవంత్ రెడ్డి వెల్లడించలేదన్నారు.బిజెపిని నిలువరించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, టీజేఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని, సీట్ల పంపకాలు జరుపుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందన్నారు.పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆ అభ్యర్థి పార్టీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారారు. మరోచోట బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కూడా దిగలేదు. ఇంకోచోట అభ్యర్థిని ప్రకటించినా కనీసం ప్రజలను కలవడం లేదన్నారు.ఇంకా అధికారికంగా 2 సీట్లు ప్రకటించాల్సి ఉంది. కాని, నడుస్తున్న చరిత్ర.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందన్న అనుమానం వ్యక్తం చేసారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధాన్ని మరింతగా పెంచిపోషిస్తోంది. దీనికి అనుసంధానకర్తగా ఎంఐఎం వ్యవహరిస్తోంది. ఆ రెండు పార్టీలను ఎంఐఎం కలిపి నడిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నడిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన శాసనసభ్యులు... పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల సీట్లను డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కలుస్తామంటే టైం ఇవ్వడం లేదని మాట్లాడడం నవ్వులాటలా ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి శాసనసభ, రెండో శాసనసభలను లోతుగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది. అప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలని మూకుమ్మడిగా లేఖలు సమర్పించారు. నోటీసులు ఇచ్చారు. మూకుమ్మడిగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది. నేడు అదే వ్యవహారంలా కనపడుతోంది. దీని వెనుక కారణం.. బిజెపి పార్టీని నిలువరించి గెలుపును అడ్డుకోవాలనే కుట్ర. మరో కారణం కుంగిన కాళేశ్వరం పిల్లర్లు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడుతున్న విషయాలన్నారు.ఈ విషయాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఫెవికాల్ బంధాన్ని తెలియజేస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ.. పదేండ్ల వరకు ఆయనే ముఖ్యమంత్రి అంటున్నారు. మరో నాయకుడు ముఖ్యమంత్రిని సమర్థించడం కొంతమందికి నచ్చడం లేదని మరో సీనియర్ నాయకుడు మాట్లాదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిశీలిస్తే తరచుగా ముఖ్యమంత్రులను మార్చడం, తొలగించడం.. అధికార మార్పిడికి నిర్ణయాలు చేయడం చరిత్ర చెబుతోందని అన్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి    నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి   
నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి .   నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ...
30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11  ,అత్యధికంగా మల్కాజిగిరిలో 77
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్రానికి రాక.
బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు
నేటి నుండి వేసవి సెలవులు.
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.