చంద్రమోహన్‌ మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు

చంద్రమోహన్‌ మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు

చంద్రమోహన్‌ మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు.

 

 హైదరాబాద్ నవంబర్ 11 (మీడియా ఫోకస్ న్యూస్):

సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ (82) మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇంస్ట్రీలో లక్కీ హీరోగా పేరు పొందిన ఆయన 900కుపైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

 

చంద్రమోహన్‌గా మారి..

చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి ‌చంద్రశేఖర్‌రావు 1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించారు. బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివారు. చదువుకునే రోజుల నుంచే నాటకాలు వేయడంలో ఆయన దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు. మద్రాసు వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆరంభంలోనే బీఎన్‌రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు.ఆయనే చంద్రశేఖర్‌కు చంద్రమోహన్ అని నామకరణం చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన చంద్రమోహన్‌గానే పరిచయం అయ్యారు. బీఎన్‌రెడ్డి తెరకెక్కించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో కథానాయకుడిగా పరిచయమైన చంద్రమోహన్, తరువాత తన దరికి చేరిన పాత్రలన్నింటికీ న్యాయం చేయడానికి పరితపించారు. నాటి మేటి నటులు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కాంతారావు, జగ్గయ్యతో కలిసి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత తన తరం నటులు శోభన్‌ బాబు, కృష్ణ, కృష్ణం రాజు నటించిన చిత్రాల్లోనూ ముఖ్యపాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఒకానొక దశలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. ఆ సమయంలో ఏడాదికి ఇరవై చిత్రాల్లో నటించి భళా అనిపించారు చంద్రమోహన్.

 

రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు.

ఇండ్రస్ట్రీలో లక్కీ హీరోగా పేరున్న చంద్రమోహన్‌ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించేవారు. ఎందరో నటీమణులు ఆయన సరసన హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా వెలుగొందారు. దాదాపు 175 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. మొత్తంగా 900కుపైగా సినిమాల్లో యాక్ట్‌ చేశారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన ఇప్పటివరకు రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారెళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు, 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా నంది అవార్డు, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు.

 

చంద్రమోహన్‌తో నటించేందుకు హీరోయిన్స్‌ పోటీ..

ప్రముఖ దర్శకులు కళాతపశ్వి కె.విశ్వనాథ్.. చంద్రమోహన్‌కు అన్న వరుస అవుతారు. ప్రతిభ లేకుంటే ఏ అన్న కూడా ఆదరించలేడు కదా..! అలాగే విశ్వనాథ్ తన చిత్రాల్లో చంద్రమోహన్‌కు తగ్గ పాత్రలుంటే తప్పక అతణ్ణే పిలిపించేవారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం వంటి చిత్రాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఇంటింటి రామాయణం, పదహారేళ్ళ వయసు, తాయారమ్మ-బంగారయ్య, కోరికలే గుర్రాలయితే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, పెళ్ళిచూపులు, రాధాకళ్యాణం, మూడుముళ్ళు మొదలైన చిత్రాల్లోనూ చంద్రమోహన్ హీరోగా నటించి మెప్పించారు. ఆయన సరసన నాయికలుగా నటించిన జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి వంటి వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు. అప్పటి నుంచీ కొత్త అమ్మాయిలు చంద్రమోహన్ సరసన నటించడానికి ఉత్సాహం ప్రదర్శించేవారు.

 

చివరి సారిగా..

తన పర్సనాలిటీకి ఎప్పుడూ హీరో వేషాలే రావని అనుకున్న చంద్రమోహన్.. ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు ఇతరుల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించేవారు. అదే ఆయన కెరీర్‌ను ఇంతకాలం లాక్కొచ్చిందని చెప్పవచ్చు. తరువాతి తరం హీరోల చిత్రాల్లోనూ అన్నగా, బావగా, మామగా, తండ్రిగా నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇప్పటి యంగ్ హీరోస్ సినిమాల్లో తాతగానూ కనిపిస్తున్నారు. ఆయన చివరి చిత్రం గోపీచంద్‌ నటించిన ‘ఆక్సిజన్‌’. ఆ తర్వాత అనారోగ్యం, వయసు రీత్యా నటనకు దూరంగా ఉంటున్నారు.

చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య ప్రముఖ రచయిత్రి. ఇద్దరు పిల్లల్లో పెద్దామ్మాయి మీనాక్షి సైకాలజిస్ట్‌. అమెరికాలో స్థిపరడ్డారు. రెండో కుమార్తె మాధవి. ఆమె కూడా డాక్టర్‌. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి    నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి   
నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో పీహెచ్డీ చేసిన సీఎం జగన్ రెడ్డి .   నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ...
30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11  ,అత్యధికంగా మల్కాజిగిరిలో 77
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్రానికి రాక.
బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు
నేటి నుండి వేసవి సెలవులు.
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.