మహిళల రక్షణే ధ్యేయం : రాచకొండ సిపి డాII.తరుణ్ జోషి, ఐపితఎస్.,

15 రోజుల్లో 125 మంది పోకిరీలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్:  

మహిళల రక్షణే ధ్యేయం : రాచకొండ సిపి డాII.తరుణ్ జోషి, ఐపితఎస్.,

మహిళల రక్షణే ధ్యేయం : రాచకొండ సిపి డాII.తరుణ్ జోషి, ఐపితఎస్.

15 రోజుల్లో 125 మంది పోకిరీలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్:  

 

హైదరాబాద్ జులై 09(మీడియా ఫోకస్ ): బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్‌ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ డా.తరుణ్ జోషి, ఐపిిఎస్ గారు తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడించే వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.., వారిని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని అన్నారు.

 రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 125 (మేజర్స్-42, మైనర్స్-83) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వారికి ఎల్‌బి నగర్ CP Camp office (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు) లో, కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.  

 గత నెల తేదీ 16 నుండి 30 వరకు 168 పిర్యాదులు అందినాయని, రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డి‌.సి.‌పి, టి. ఉషా విశ్వనాథ్ గారు తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. 

అందిన ఫిర్యాదులలో..,

ఫోన్ల ద్వారా వేదించినవి -29 , 

Social media apps ద్వారా వేదించినవి- 41

నేరుగా వేదించినవి – 98. 

వాటిలో క్రిమినల్ కేసులు-14, పెట్టి కేసులు- 36, మరియు 88 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

 

 ముఖ్యమైన కేసులు కొన్ని...  

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి అరెస్టు: 

కుషాయిగూడ లో నివాసం ఉంటున్న యువతికి నిందితునితో పరిచయం ఏర్పడింది. వారిరువురూ మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. కొద్ది రోజుల తర్వాత ఆమెని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పలుమార్లు శారీరకంగా అనుభవించాడు. బాదితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. తరువాత ఆమెతో పెళ్ళికి నిరాకరించి, వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు . దీంతో బాదితురాలు ఇట్టి విషయంపై షీ టీం కుషాయిగూడ వారిని సంప్రదించగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపడమైనది. 

 

మైనర్ బాలికను ప్రేమించమంటూ వేదింపులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్టు :  

 హయాత్ నగర్ లో నివాసముండే బాలికకు, నిందితుడు ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం ఐన వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా ప్రేమించమని వెంటపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సదరు యువతి ఎంత చెప్పిన వినకుండా అలాగే వెంటపడేవాడు, అంతే కాకుండా అసభ్య పదజాలంతో ఆమెకు మెసేజ్‌లు పంపిస్తూ వేదిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతికి షీ టీమ్ కుషాయిగూడ ని సంప్రదించగ నిందితున్ని అదుపులోకి తీసుకొని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.

 

ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్న సహ ఉద్యోగి అరెస్టు:

నేరేడుమేట్ ప్రాంతంలో నివాసముండే యువతి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. ఆమె తో పాటు పని చేసే సహ ఉద్యోగి ప్రేమించమని, అతనితో రావాలని వేదిస్తున్నాడు. ఆమెకు తెలియకుండా ఆమె ఫోటోలని తీసుకొని మార్ఫింగ్ చేసి, అతని ప్రేమను ఒప్పుకోవాలని, అతన్ని కలవాలని, లేకపోతే వాటిని తన కుటుంబ సభ్యులకు పంపిస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎంత చెప్పిన వినకపోవడంతో బాదితురాలు షీ టీమ్ కుషాయిగూడ ని సంప్రదించగా నిందితున్ని అదుపులోకి తీసుకొని నేరేడ్మెట్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.

 

Instagram ద్వారా వేదిస్తున్న వ్యక్తులపైనా కేసు నమోదు:

ఇబ్రహీంపట్నంలో లో నివాసముండే యువతికి గుర్తు తెలియని వ్యక్తి Instagram ద్వారా ప్రేమించమని సందేశాలు పంపించాడు, సదరు యువతి ఒప్పుకోకపోవడంతో, ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెడతానని, అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులకు మరియు బందువులకు పంపుతానని బెదిరించాడు. ఇట్టి విషయంపై విసిగిపోయిన యువతి షీ టీమ్ ఇబ్రహీంపట్నం సంప్రదించగ, ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేయడమైనది.

కళాశాల విద్యార్థినులను వేదిస్తున్న పోకిరీల అరెస్టు.

 భువనగిరి బస్ స్టాండ్ లో ఈవ్ టీజింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన షీ టీమ్ Bhongir అక్కడికి చేరుకొని ఈవ్ టీజింగ్ చేస్తున్న ఇద్దరు పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపైన Bhongir Town పి‌ఎస్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.

 

అవగాహన కార్యక్రమాలు :

గత నెల తేదీ 16 నుండి 30 వరకు షీ టీమ్స్ రాచకొండ మొత్తం 51 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు 6930 మందికి మహిళా చట్టాలు, వారి యొక్క హక్కులు మరియు నేరాల గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది. 

మెట్రో-రైల్ డెకాయ్ ఆపరేషన్స్: రాచకొండ షీ టీమ్స్ మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్సు నిర్వహించి, మహిళా కంపార్మెంట్‌లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న (08) మంది పురుషులను పట్టుకుని మెట్రో స్టేషన్ అదికారుల ద్వారా ఫైన్ వేయించడం జరిగింది.

 

డెకాయ్ ఆపరేషన్స్: 

షీ టీమ్స్ రాచకొండ తమ పరిది ఏరియాలలో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించి రోడ్డు మీద వెళ్ళుతున్న మహిళలను, ఆడపిల్లలను వేధీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న 88 మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది. 

ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన మరియు సామాజిక మాద్యమాల ద్వారా జరిగే దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ షీ టీమ్ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే SHE Teams ని, Rachakonda WhatsApp నెంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీ టీమ్ అధికారుల నంబర్లు 

Bhongir area- 8712662598,

Choutuppal area - 8712662599,

Ibrahimpatnam area -8712662600, 

Kushaiguda area -8712662601, 

LB Nagar area -8712662602,

Malkajgiri area -8712662603

Vanasthalipuram area -8712662604 లకు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

      విమెన్ సేఫ్టీ వింగ్ డి.‌సి.‌పి శ్రీమతి టి. ఉషా విశ్వనాథ్, ఏసిి‌పి వెంకటేశం, అడ్మిన్ ఎస్‌ఐ రాజు మరియు షీ టీమ్స్‌ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. 

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

 Editor  of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!? రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?
రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?  ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీహైదరాబాద్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ )వికారాబాద్ జిల్లా...
ఎసిబి వలలో భారీ తిమింగలం. 
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం