రక్త నిధి కేంద్రాల తరహాలో.. ఇప్పుడు చర్మనిది కేంద్రాలు..

రక్త నిధి కేంద్రాల తరహాలో.. ఇప్పుడు చర్మనిది కేంద్రాలు..

రక్త నిధి కేంద్రాల తరహాలో.. ఇప్పుడు చర్మనిది కేంద్రాలు..

 

సిద్దిపేట మార్చ్ 29 (మీడియా ఫోకస్ );: ఐ బ్యాంకులో వచ్చాయి. రక్త నిధి కేంద్రాలు వచ్చాయి. ఇప్పుడు చర్మనిది కేంద్రాలు వచ్చేస్తున్నాయి. శరీరము 70 శాతానికి పైగా కాలిన వారికి చర్మ బ్యాంకుల నుంచి చర్మాన్ని తీసుకొచ్చి ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నారు. హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో ఇటువంటి సర్జరీలు నెలకు సుమారు 10 వరకు జరుగుతున్నాయి. వివిధ అధ్యయనాల ప్రకారం ప్రమాదాలలో కాలిన గాయాల బారిన పడుతున్న వారిలో 80 శాతం మహిళలు, చిన్నారులే ఉంటున్నారు. 75 శాతానికి పైగా శరీరం కాలిన వారు బతకడం కష్టమని వైద్యులు చెబుతుంటారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోనికి వచ్చాయి. ఈ దశలో బాధితుల ప్రాణాలు కాపాడటంలో చర్మ బ్యాంకులు కీలకంగా మారాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చర్మ బ్యాంకులు చాలా తక్కువ. ముంబాయి, పూణే, చెన్నై, హైదరాబాదులో మాత్రమే ఉన్నాయి. వీడి సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటిదాకా మనదేశంలో 2010 నుంచి 2023 వరకు సుమారు రెండువేల మంది చర్మదానం చేశారు. చనిపోయిన తర్వాత చర్మదానం చేయవచ్చన సంగతి చాలామందికి తెలియకపోవడమే ఈ సంఖ్య తక్కువగా ఉండటానికి కారణమని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

 

ఆరు గంటల లోపు సేకరించాలి: 

ఒక మనిషి మరణించాక ఆరు గంటల లోపు చర్మాని సేకరించాలి. మృతుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. 100 సంవత్సరాల వయసు వారి చర్మం సైతం పనికొస్తుంది. చర్మాని సేకరించేందుకు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. వైద్యుడు పర్యవేక్షణలో నలుగురు వైద్య సిబ్బంది బృందము డర్మాటోము అనే యంత్రం ద్వారా చర్మాని సేకరిస్తారు అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు

 

ఎవరి చర్మం పనికిరాదు:

 చర్మదానానికి అంగీకరించేటప్పుడు లేదా మరణించిన వ్యక్తి నుంచి చర్మాని సేకరించేటప్పుడు ఎయిడ్స్, హెపటైటిస్ పరీక్షలు చేస్తారు. హెచ్ఐవి, హెపటైటిస్ బీ.సీ. సుఖరోగాలు, చర్మ క్యాన్సర్ ఉండే వారి చర్మం పనికిరాదు. షుగర్, బీపీ ఉన్నవాళ్లు కూడా చర్మదానం చేయవచ్చు అని డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

 

ఎక్కడ నుంచి తీస్తారు:

 కాళ్లు, తొడలు, వెనుక భాగం నుంచి చర్మాని తీస్తారు. చర్మం లో మొత్తం ఎనిమిది పొరలు ఉంటాయి. వాటిలో ఒకటో వంతు పొరను మాత్రమే తీస్తారు. మిగిలిన ఏడుపారుల జోలికి వెళ్లరు. సేకరించినప్పుడు ఎక్కడా రక్తం కనిపించదు. శరీరము రూపం మారదు. చర్మం సేకరించాక ఆ భాగాలన్నింటికీ బ్యాండేజ్ లు వేసి కుటుంబీకులకు అప్పగిస్తారని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

 

ఎవరికైనా వేయవచ్చా:

 ఇతర అవయవాల మార్పిడిలో రక్తం గ్రూపులు కలవాలి. కానీ చర్మం మార్పిడిలో అవసరం లేదు. వయస్సు రంగుతో కూడా సంబంధం ఉండదు. ఎవరి చర్మాన్ని ఎవరికైనా వేయవచ్చు అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

 

ఎలా భద్రపరుస్తారు:

 సేకరించిన చర్మాని రసాయనిక ద్రావణాలలో శుభ్రపరిచి 6 నుంచి 8 సెంటీమీటర్లు ఉండేలా ముక్కలుగా కత్తిరిస్తారు. గ్లేసే రాల్ స్టెరయిల్ వయాల్స్ లో 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరుస్తారు. దీని యొక్క కాలపరిమితి ఐదేళ్లపాటు ఉంటుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.

 

మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో: 

మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలో మరియు డ్వాక్రా గ్రూపులో, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు యందు, గ్రామాలలోని రచ్చబండ యందు చర్మదానముపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రజల చేత ప్రతిజ్ఞలను చేయించడం జరుగుతుంది అని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి తెలిపారు.

 

 చర్మదానం ఎలా చేయవచ్చు అంటే:

ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే... మృతుని బంధువులు వెంటనే బర్న్ హెల్ప్ లైన్ లేదా నేషనల్ బర్న్ సెంటర్ కు సమాచారం అందించాలి. వారు మరణానికి కారణాలు తెలుసుకుంటారు. ప్రత్యేక వాహనంలో వైద్య బృందం వస్తుంది. మరణ ధ్రువపత్రము, మృతిని కుటుంబీకుల నుంచి అంగీకారం తీసుకొని చర్మం సేకరిస్తారు. ఎటువంటి ఖర్చు ఉండదని తెలిపారు.

 

స్కిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో ఉపయోగం:

 ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి. నొప్పులు చాలా తక్కువగా ఉంటాయి. త్వరగా నయం అవుతుంది. యాంటీబ యాటి క్స్ అవసరం బాగా తగ్గుతుందని లిల్లీ మేరి తెలిపారు.

 

మన రాష్ట్రంలో స్కిన్ బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి:

 హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని మొదటి చర్మ బ్యాంకు వైద్యులు బ్రెయిన్ డెత్ ద్వారా దాత నుంచి తొలిసారిగా చర్మాన్ని వెలికితీసే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అధికారులు బ్రెయిన్ డెడ్ రోగి బంధువులను సంప్రదించి కౌన్సిలింగ్ తర్వాత బ్రెయిన్ డెడ్ రోగి చర్మాన్ని దానం చేయడానికి అంగీకరించారు. భారతదేశంలో స్కిన్ బ్యాంకులు మహారాష్ట్రలో 16, చెన్నైలో నాలుగు, కర్ణాటకలో మూడు, మధ్యప్రదేశ్లో ఒకటి, ఒరిస్సాలో ఒకటి, ఢిల్లీలో ఒకటి, హైదరాబాదులో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఒకటి ప్రస్తుతానికి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రిలు స్కిన్ బ్యాంకులను పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయని లిల్లీ మేరి తెలిపారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది
బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.   *ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు *ముందు చూపుతో హైదరాబాద్...
తెలంగాణ ఉద్యోగుల సంఘం, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ బోనాల సంభరాలు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను.
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు