వారి కృషి జాతి మరవలేనిది.

భారతరత్న ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్.

వారి కృషి జాతి మరవలేనిది.

వారి కృషి జాతి మరవలేనిది.

భారతరత్న ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్.

 

న్యూ డిల్లీ ఫిబ్రవరి 9 (మీడియా ఫోకస్ );భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారతదేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం చేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత హోం మంత్రిగా పని చేసిన చరణ్ సింగ్ రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచాయి. దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలను గౌరవించడం ప్రభుత్వానికి దక్కిన అదృష్టం అని ప్రధాని మోదీ కొనియాడారు.

 

పీవీ నరసింహారావు..

 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం ఆనందంగా ఉంది. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాలలో విస్తృత సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏళ్లుగా ఆయన విశేష కృషి చేశారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో, దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించింది. నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థికాభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

 

ఎంఎస్ స్వామినాథన్‌..

 

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశానికి చేసిన విశేష కృషికి గానూ భారతరత్న ఇవ్వడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సంక్షేమానికి వ్యవసాయం, రైతులు మూలస్తంభాలు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వ్యవసాయంలో తీసుకువచ్చిన మార్పులు పెనుమార్పులు తీసుకువచ్చాయి. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక ఆవిష్కర్తగా, మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన ముందుచూపు వ్యవసాయ రూపరేఖలు మార్చడమే కాకుండా ఆహార భద్రతకు హామీ ఇచ్చిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది
బడ్జెట్ చూసి కేసీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది.   *ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు *ముందు చూపుతో హైదరాబాద్...
తెలంగాణ ఉద్యోగుల సంఘం, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ బోనాల సంభరాలు.
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి తగ్గిన రూ. 76,795 కోట్ల ఆదాయం
మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాను.
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
కోకాపేట వరకు రెండో దశలో మెట్రో రైలు