వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు

వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు

వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జూన్ 6(మీడియా ఫోకస్ న్యూస్ ): రాష్ట్రంలో మంగళవారం నుంచి వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. తెలంగాణ అంతటా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నదంటూ పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొన్నది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక లో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్‌లో జూన్‌ ఒకటి నాటికి క్రమం తప్పకుం డా నైరుతి రుతుపవనాలు కేరళ వద్ద తీరాన్ని తాకి నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈసారి కేరళ తీరం వైపుగా రుతుపవనాల కదలికలు స్తంభించిపోవడానికి అరేబియా సము ద్రం ఆగ్నేయ ప్రాంత గగనతలంపై 5.8 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి కారణం. మరో 24 గంటల వ్యవధిలో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నది. క్రమంగా ఈ నెల 8 నాటికి తుఫాన్‌గా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం రుతుపవనాల కదలికలపై ఉం టుంది. ఈ పరిస్థితులు కేరళ తీరం వైపునకు నైరుతి రుతుపవనాల పురోగతిని తీవ్రంగా ప్ర భావితం చేసే అవకాశం ఉన్నదని అంచనా వే సింది. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐ ఎండీ పేర్కొన్నది. రుతుపవనాల రాకలో జా ప్యం వల్ల ఎండ తీవ్రత కొనసాగుతున్నది.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?    తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా! ..‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో నిలదీసిన చంద్రబాబు   శ్రీకాకుళం ఏప్రిల్...
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్రానికి రాక.
బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు
నేటి నుండి వేసవి సెలవులు.
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.
విజయ లక్ష్మీ వెంకటేశ పుస్తక ఆవిష్కరణ
సంక్షేమ విద్యార్ధి వసతి గృహాల అద్దెలను విడుదల చేయండి.