ప్రభుత్వ భూములను రక్షించాలని, రెవిన్యూ అధికారుల అవినీతిని అరికట్టాలని, దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

 ప్రభుత్వ భూములను రక్షించాలని, రెవిన్యూ అధికారుల అవినీతిని అరికట్టాలని, దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

ప్రభుత్వ భూములను రక్షించాలని, రెవిన్యూ అధికారుల అవినీతిని అరికట్టాలని, దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా.

FB_IMG_1685975602294FB_IMG_1685975595808

హయత్నగర్ జూన్ 5(మీడియా ఫోకస్ న్యూస్) : హయత్నగర్ మండల్  లో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించాలని, రెవిన్యూ అధికారుల అవినీతిని అరికట్టాలని, దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ సంధ్యారాణికి మేమో రాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సేవదల్ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినటర్ బోడ శ్రావణ్*   

 అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు , పారంద స్వామి, సిపిఎం జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ లు మాట్లాడుతూ, హయత్ నగర్ మండలంలో జీవో నెంబర్, 58,59,118 ఆధారం చేసుకుని రియల్ ఎస్టేట్ మాఫియా, రెవిన్యూ అధికారులు కుమ్మక్కై మండలంలో 70 ఎకరాలు దాదాపు 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, కబ్జా చేసి దొంగ నోటరీ డాక్యుమెంట్ సృష్టించి రెగ్యులరైజేషన్ కోసం, ఆన్లైన్ దరఖాస్తులు పెట్టికున్నారు. రెవెన్యూ అధికారులు, ఒక్క డాక్యుమెంట్ దారుల దగ్గర, రెండు లక్షల నుండి 5 లక్షల వరకు డిమాండ్ చేస్తూ తీసుకుంటున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారి ఇళ్ళలను కూల్చివేసి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాహెబ్ నగర్ కలాన్ సర్వేనెంబర్ 71/1 లో రెవెన్యూ అధికారులే 11 ఇల్లు కట్టుకున్నారని భారీ ప్రచారంలో ఉంది. సర్వేనెంబర్, 71/2,71/3 భూమిలో 118 జీవోను ఆధారం చేసుకుని, సర్వేనెంబర్ 71/1 బదులు, సర్వేనెంబర్ 71/2,71/3తో వస్పరి జంగయ్య పేరుతో దొంగ నోటరీ సర్టిఫికెట్లు సృష్టించి, ఇల్లు కట్టుకొని ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకున్నారు, దాదాపుగా 5 ఎకరాలు ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అమ్ముకుంటున్నారు, బాగ్ హయత్ నగర్, సర్వేనెంబర్ 207 లో ప్రభుత్వ భూమి 15 ఎకరాలు, గతంలోనే అసైన్మెంట్ దారుల నుండి పిఓపి కింద ఈ భూమిని ప్రభుత్వం తీసుకుంది. అట్టి భూమిలో ప్రస్తుతం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేస్తున్న, రెవెన్యూ అధికారులు ఇది ఖరీదైన భూమి కాబట్టి ఒక్క ఫ్లాట్ దారులు దగ్గర మూడు లక్షల నుండి 5 లక్షల రూపాయలు ఇచ్చిన వారికే రెగ్యులరైజేషన్ చేస్తామని, ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారి దగ్గరికి వెళ్లి వారి నిర్మాణాలను కూ ల్చివేసి, అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, హయత్ నగర్ మండలంలో ఈ జీవో లా పేరుతో ప్రభుత్వ భూమి అంటూ లేకుండా, రెవిన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై విచ్చలవిడిగా లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను, కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నారు. కావున సాహెబ్ నగర్ కలాన్, సర్వే నెంబర్ 71/2,71/3 లో జీవో నెంబర్ 118 పేరుతో పెట్టుకుంటున్న ఆన్లైన్ దరఖాస్తులను, పరిశీలించి, ఆ భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమిని బయటికి తీసేంతవరకు వారి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల ప్రజా ఉద్యమాలు చేసి దీనికి కారణమైన అధికారులను సస్పెండ్ చేసేంతవరకు ఆందోళన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు కనకయ్య, ప్రభాకర్, దళిత నాయకులు *వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సేవదల్ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినటర్ బోడ శ్రావణ్ కుమార్*, చుక్క రవి, గుండె శివకుమార్, రసూల్, గూడ సోమయ్య, అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్నా చేసి ఎమ్మార్వో గారికి మెమో రాండం ఇవ్వడం జరిగింది.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News