రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా బిసిలు ఉద్యమించాలి ·       రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి

రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా బిసిలు ఉద్యమించాలి  ·       రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి

రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా బిసిలు ఉద్యమించాలి

·       రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి

·       రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు

·       పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలి

·       చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలి

·       బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుదాకర్ ముదిరాజ్ పిలుపు

హైదరాబాద్ అక్టోబర్ 20 (మీడియా ఫోకస్ న్యూస్ );పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వత్వరలో చేపట్టబోయే జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుదాకర్ ముదిరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. దేశ జనాభాలో 50 శాతం జనాభా గల బీసీలకు ఇప్పటికీ ఏ రంగంలో కూడా ప్రజాస్వామ్య వాటా లభించలేదని,బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీసీ సంఘాలు చిన్న,చిన్న రాయితీల కోసం సమయం వృధా చేసుకోకుండా రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంకు నాయకత్వం వహించి ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల వారు కొన్ని వేల సంవత్సరాలుగా తమ కుల వృత్తుల ద్వారా దేశ సంపద సృష్టించి - సమాజాన్ని బతికించారునడిపించారు.  నేడు ప్రజాస్వామ్యవస్థలో జీవిస్తున్నాం అన్ని కులాలకుసామాజిక వర్గాలకు జనాభా ప్రకారం విద్య,ఉద్యోగ,ఆర్థికరాజకీయ,సామాజిక,వ్యాపారవాణిజ్యపారిశ్రామికకాంట్రాక్టర రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి కానీ 75 సంవత్సరాల కాలంలో ఏ రంగంలో కనీస వాటా కూడా లభించలేదు. దేశ సంపద సృష్టించారు కానీ సంపదలో వాటా లభించలేదుపన్నులు కట్టారు కానీ బడ్జెట్ వాటా లభించలేదుఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకున్నారు కానీ అధికారం వాటా ఇవ్వడం లేదుపార్టీలు మాటున అధికారం చాటున అగ్రకులాలు బీసీ కులాలను అణిచిపెట్టారు. గత 75 సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వాలు బీసీలను అణచిపెట్టారుబిచ్చగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సుదాకర్ విమర్శించారు. పేరుకే మనది ప్రజాస్వామ్య దేశం కాని ఆచరణలో ధనస్వామ్య దేశంగా మారిపోయిందని విమర్శించారు. డబ్బున్న పారిశ్రామిక వేత్తలువ్యాపారస్తులుకాంట్రాక్టర్లు డబ్బులతో పార్టీ టికెట్లు కొనిడబ్బులతో ఓట్లు కొని ఆ తర్వాత ఎన్నికైన పదవిని డబ్బు సంపాదనకు ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు..స్వాతంత్ర్య  భారతంలో బి.సి లకు రాజకీయంగా కనిస ప్రాతినిధ్యం లభించడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం గత 75 సంవత్సరాల గణాంకాలు పార్లమెంట్ సభ్యులుశాసన సభ్యులుకేంద్ర-రాష్ట్ర మంత్రులు వివరాలు సేకరిస్తే బి.సి ల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదు. గత 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో 56 శాతం జనాభా గల బి.సి లకు 14 శాతం ప్రాతినిధ్యం దాటలేదంటే రాజకీయ రిజర్వేషన్లు పెట్టవలిసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. అంతేకాదు. 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక పార్లమెంట్  సభ్యులు లేరు. ఈ ప్రజాస్వామ్య స్పూర్తి ఎక్కడ కనిపిస్తుందని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమాధనస్వామ్యమాఅని ప్రశ్నించారు. తెలంగాణా లో 119 యం.యల్.ఏ. లు ఉంటే బి.సి లు కేవలం 21 మంది మాత్రమె ఉన్నారు. ఇంత తక్కువ ప్రాతినిధ్యం చూస్తే ఇదెలా ప్రజాస్వామ్యమవుతుంది. 56 శాతం జనాభా గల బి.సి లకు ప్రాతినిధ్యం ఏదని ప్రశ్నించారు. బి.సి లు ఓట్లు వేయడానికేనా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలు మారాలి. పేదరికం ఆకలి అనుభవించిన వారు చట్ట సభలోకి వస్తే వాటి రూపుమాపే చట్టాలు వస్తాయన్నారు.

 

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?    తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా! ..‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో నిలదీసిన చంద్రబాబు   శ్రీకాకుళం ఏప్రిల్...
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్రానికి రాక.
బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు
నేటి నుండి వేసవి సెలవులు.
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.
విజయ లక్ష్మీ వెంకటేశ పుస్తక ఆవిష్కరణ
సంక్షేమ విద్యార్ధి వసతి గృహాల అద్దెలను విడుదల చేయండి.