పామర్రు వైఎస్సార్సీపీ నేత దోవారి ఏసు దాస్ పార్టీ నుండి బహిష్కరణ

పామర్రు వైఎస్సార్సీపీ నేత దోవారి ఏసు దాస్ పార్టీ నుండి బహిష్కరణ

పామర్రు వైఎస్సార్సీపీ నేత దోవారి ఏసు దాస్ పార్టీ నుండి బహిష్కరణ.

అమరావతి అక్టోబర్ 19 (మీడియా ఫోకస్ న్యూస్ );ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారి పైన చర్యలు మొదలు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే ఇలా నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను సీఎం జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవారి ఏసు దాస్ (డీవై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా డీవై దాస్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా వర్ల రామయ్యకు  ఇచ్చింది. దీంతో వైసీపీ తరఫున పోటీ చేసిన ఉప్పులేటి కల్పన నెగ్గారు. ఆ తర్వాత ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మళ్లీ 2019 ఎన్నికల తర్వాత డీవై దాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు.అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు డీవై దాస్పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత సీఎం జగన్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా 2019 ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ గెలుపొందారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోటీ చేశారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే గెలిచింది. ఉప్పులేటి కల్పన వైసీపీ నుంచి గెలిచి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే.ఇక వచ్చే ఎన్నికల కోసం ఇక్కడ నుంచి టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేసింది. పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా వర్ల రామయ్య తనయుడు కుమార్ రాజా నియమితులయ్యారు. వైసీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోటీ చేసే చాన్స్ ఉందని అంటున్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

Domalapally Nagaraju Editor n Publisher of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as executive editor, Buero Incharge.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Latest News

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి?    తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా! ..‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో నిలదీసిన చంద్రబాబు   శ్రీకాకుళం ఏప్రిల్...
ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ రాష్ట్రానికి రాక.
బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.4వేల కోట్లు
నేటి నుండి వేసవి సెలవులు.
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.
విజయ లక్ష్మీ వెంకటేశ పుస్తక ఆవిష్కరణ
సంక్షేమ విద్యార్ధి వసతి గృహాల అద్దెలను విడుదల చేయండి.